Sunday, October 6, 2024

Stock Market – ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్..

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 3 పాయింట్లు తగ్గి 24,331 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 36 పాయింట్లు దిగజారి 79,960 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, హెచ్‌యూఎల్‌, నెస్లే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లో ప‌య‌నించాయి

టైటాన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎం అండ్‌ ఎం, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ ఫార్మా, మారుతీ సుజుకీ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement