Friday, October 18, 2024

AP | దేవరగట్టులో క‌ర్ర‌ల స‌మ‌రం.. 70 మందికి గాయాలు..

కర్నూలు బ్యూరో (ఆంధ్ర‌ప్ర‌భ‌): కర్నూలు జిల్లా ఆలూరు మండలం దేవరగట్టు సంప్రదాయ కర్రల సమరంలో 70 మంది గాయపడ్డారు. దసరా పండుగ సందర్భంగా శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవంలో హింస చోటు చేసుకుంది. వేడుక సందర్భంగా సముద్రమట్టానికి సుమారు 900 అడుగుల ఎత్తులో ఉన్న మాల మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తుండగా వాటిని సంరక్షించుకునేందుకు సమీప చుట్టుపక్క గ్రామాలు తలపడ్డాయి.

- Advertisement -

ముఖ్యంగా నెరనికి తాండ, కొత్తపేట, అరికెర, అరికెర తండా, సులువాయి, ఎల్లార్తి, కురుకుంద, విరుపాపురం, బిలేహల్ గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు సంప్రదాయబద్ధంగా పోటీపడ్డారు. ఈ క్రమంలో నెలకొన్న హింస మూలంగా 70 మంది గాయపడ్డారు. వారిని స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స నిర్వహించారు. ఇందులో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement