Thursday, September 26, 2024

AP: శ్రీశైల హుండీ ఆదాయం రూ.4 కోట్లు..

కర్నూలు బ్యూరో : శ్రీశైలంలో గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.4,00,65,375 నగదు రాబడిగా ల‌భించిందని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఇందులో ఆలయ హుండీల ద్వారా రూ.3,86,82,321లు, అన్నప్రసాద వితరణ హుండీ రూ.13,83,054, మొత్తం 4,00,65,375 ఆదాయం సమకూరిందన్నారు. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 35 రోజులలో అంటే ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 25వరకు సమర్పించడం జరిగిందన్నారు.

అదేవిధంగా అన్నదానం హుండీ రాబడి మార్చి 12వ తేదీ నుంచి సెప్టెంబరు 25వ తేదీ వరకు వచ్చిందని వివరించారు. వీటితో పాటు 488 యుఎస్ఏ డాలర్లు, 12 – కువైట్స్ దినార్స్, 6000- ఉగాండా షిలింగ్స్. 30 – యుకే పౌండ్సు, 60 సింగపూర్ డాలర్లు, 20 హంకాంగ్ డాలర్లు 10 ఈరోస్, 20 – మలేషియా రింగిట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఉండిని లెక్కింపు చేపట్టడం జరిగిందని ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆర్. రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement