Saturday, September 7, 2024

SKLM: భార్యపై భర్త కత్తితో దాడి…

ఇచ్ఛాపురం : పట్టణంలోని మూడియా వీధిలో సుదర్శన శ్రీను సుదర్శన దుర్గ భార్యాభ‌ర్త‌లు ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నారు.. భర్త ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానంతో భార్యా భర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి.. గత రాత్రి భార్య, భర్తల మధ్య భర్త జీతం విషయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది.

అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త భార్యపై ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేశాడు. బాధితురాలు స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలికి స్థానిక సీహెచ్ సీలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఒడిశాలోని బరంపురంకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగుందని పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై గోపాలకృష్ణ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement