Friday, October 18, 2024

AP: స్పీకర్ తమ్మినేనికి స్వల్ప అస్వస్థత… విశాఖ మెడికవర్ కు తరలింపు

శ్రీకాకుళం, జనవరి 6: రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన బూర్జ మండలంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొని రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆమదాల వలస తిరిగి వస్తుండగా.. అస్వస్థతకు గురికావడంతో ఆయనను శ్రీకాకుళం పట్టణంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఎమ్మారై స్కాన్ ద్వారా పరీక్ష నిర్వహించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మరింత మెరుగైన వైద్య పరీక్షల కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు శనివారం ఉదయం ఆయనను విశాఖ మెడికవర్ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు అందిస్తున్నారు. స్పీకర్ తమ్మినేనికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేవలం బ్రెయిన్ కు రక్త సరఫరాలో చిన్నపాటి జాప్యం జరుగుతున్నందువలన ఆయన అస్వస్థతకు గురయ్యారని, ఆయన ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారని శ్రీకాకుళం మెడి కవర్ కు చెందిన వైద్యులు సూర్యప్రకాష్ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement