Friday, September 6, 2024

AP : అదుపు త‌ప్పి లారీ బోల్తా…

శ్రీ‌కాకుళం జిల్లాలో ఈ ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. అదుపు త‌ప్పి లారీ బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవ‌ర్‌కు త‌ల‌కు గాయాల‌య్యాయి.

శ్రీకాకుళం జిల్లా ఎచర్ల మండలం కేశవరావు పేట పంచాయతీ కింతలమిల్లు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తున్న ఐరెన్ లోడ్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తలకు గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తులో జాతీయ రహదారి డివైడర్ పైకి లారీ ఎక్కించటంతో సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్ళి లారీ బోల్తా కొట్టింది. ఆ సమయంలో వాహనాలు రాక పోకలు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement