Thursday, September 19, 2024

Breaking: అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం : భ‌ర్త మృతి, భార్య ప‌రిస్థితి విష‌మం

అప్పుల బాధతో దంపతులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌గా, భ‌ర్త మృతిచెందగా.. భార్య ప‌రిస్థితి విషమంగా ఉన్న ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పాలకొండ మండలం చినమంగళాపురం గ్రామానికి చెందిన దంపతులు రామారావు, తవిటమ్మ అప్పుల బాధ, కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు గమనించి వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. భర్త రామారావు మార్గ మధ్యలోనే మృతి చెందాడు. తవిటమ్మ పరిస్థితి విషమంగా ఉండగా..శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement