Sunday, September 22, 2024

AP | తిరుమలలో స్పీకర్ అయ్యన్న..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలను సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఇక్కడి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సాధారణ భక్తులతో కలిసి భోజనం చేశారు. అయ్యన్నపాత్రుడు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement