Friday, October 18, 2024

AP: వాల్మీకి మహర్షికి ఎస్పీ సుబ్బరాయుడు నివాళి..

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొని వాల్మీకి మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ఒక సాధారణ వ్యక్తి ఎలా వాల్మీకి మహర్షిగా మారిపోయారో వివరించారు. రామాయణం మహా కావ్యాన్ని సంస్కృతంలో రచించి వాల్మీకి సంస్కృత ఆదికవిగా పేరు పొందారన్నారు.

వాల్మీకి జయంతి రోజు ఆ మహానుభావుని జీవిత విశేషాలు తెలుసుకొని ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆ మహర్షికి మనం ఇచ్చే నిజమైన గురుదక్షిణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రవి మనోహర చారి, శ్రీనివాసరావు, డీఎస్పీలు గిరిధర, రమణయ్య, ఏఏఓ జయలక్ష్మి, సీఐలు ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement