Friday, October 18, 2024

Sound and Whistle Cases – ఆయ‌న‌కు ఎలాగో లేదు… అమ‌లు చేసినోడి బుర్ర‌, బుద్ది ఏమైంది.. నారా లోకేష్

అమ‌రావ‌తి – టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమం సందర్భంగా విజిల్స్ వేసి సౌండ్ చేశారంటూ 60 మందిపై పోలీసులు కేసులు పెట్టాడాన్ని టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. విజిల్ వేస్తే పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు వేసుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘ఒక పని చేయండి… రాజద్రోహం కేసు పెట్టి ఉరిశిక్ష వేసేయండి’ అని మండిపడ్డారు. జగన్ కు పిచ్చి పీక్స్ లో ఉన్నట్టుందని అన్నారు. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే… అమలు చేసినోడి బుద్ధి, బుర్ర ఏమయిందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా లోకేష్ ట్విట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement