Sunday, September 8, 2024

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 280 మందికి పాజిటివ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన మూడు రోజులుగా భారీగా తగ్గిన కొత్త కేసులు తాజాగా స్వల్పంగా పెరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల 915 కరోనా పరీక్షలు నిర్వహించగా 280 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇదే సమయంలో వైరస్‌ తీవ్రతతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే అనంతపురంలో 44, చిత్తూరులో 16, తూర్పు గోదావరి జిల్లాలో 44, గుంటూరులో 28, కడప జిల్లాలో 8, కృష్ణాలో 18, కర్నూలులో 1, నెల్లూరులో 8, ప్రకాశంలో 40, శ్రీకాకుళం జిల్లాలో 00, విశాఖలో 34, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 38 మందికి కొత్తగా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 496 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల 709 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 23 లక్షల 17 వేల 464గా నమోదైంది. తాజాగా సంభవించిన రెండు మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 14 వేల 722 మంది వైరస్‌కు బలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement