Friday, September 20, 2024

AP | చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు…

నంద్యాల బ్యూరో, ప్రభ న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటింనుండగా… ఈ పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి వెల్లడించారు. రేపు పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయమడ గ్రామంలో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు రావాల్సి ఉండగా…. కొన్ని అనివార్య కారణాల వల్ల పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

‘‘ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) ఉదయం 10.30 గంటలకు “పింఛన్ల పంపిణీ” కార్యక్రమానికి ఓర్వకల్లు గ్రామానికి వస్తున్నారు… కావున సంబంధిత ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులు, ఉమ్మడి మహాకూటమి టిడిపి, బిజెపి, జనసేన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొనాలని పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement