Tuesday, July 2, 2024

SBI ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి – అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగువారందరికీ గర్వ కారణమన్నారు ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా శ్రీనివాసులు శెట్టి కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. .

.ఆయన నేతృత్వంలో ఎస్.బి.ఐ. మరెన్నో మైలురాళ్ళు అందుకోవాలనీ , క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాదకబాధకాలు తెలిసిన శ్రీనివాసులు శెట్టి ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింప చేయాలని ఆకాంక్షను వెలిబుచ్చారు పవన్ కళ్యాణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement