Friday, September 20, 2024

AP: కనకదుర్గమ్మకు సీతారాముల సారే…

సమర్పించిన భద్రాచలం ఈవో ఎల్. రమాదేవి…
స్వాగతం పలికిన ఈవో కె ఎస్ రామారావు…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మకు భద్రాద్రి సీతారాముల సారెను సాంప్రదాయ బద్ధంగా ఈవో రమాదేవి సమర్పించారు.

ఆషాడ మాసం సందర్భంగా దేవస్థానంలో శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటలో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రం, భద్రాచలం నుండి భద్రాచలం లోని శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం కార్యనిర్వాహనాధికారి ఎల్.రమాదేవి, ఆలయ అధికారులు అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో కేఎస్ రామారావు అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర సారెను సమర్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా దుర్గ గుడి ఈవో కె ఎస్ రామరావు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం వీరికి అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement