Wednesday, September 18, 2024

Sai Tej – వృద్ధాశ్రమానికి ఆ నటుడు భారీ సాయం ….

విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను సినీ నటుడు సాయి దుర్గా తేజ్‌ పరామర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

వృద్ధాశ్రమంలో వరద బాధిత వృద్ధుల సహాయార్థం రూ.2 లక్షల చెక్కును అందించారు.వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడకు వచ్చానని, వరద ముప్పు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను దర్శించుకుని ప్రార్థించానని చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.

భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తత, బాధితులను రక్షించేందుకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వ స్పందన బాగుందన్నారు. ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. వృద్ధాశ్రమం అభివృద్ధికి సాయంచేస్తానన్నారు.

- Advertisement -

మంత్రి నారా లోకేశ్‌కు చెక్కు అందజేత..

మంత్రి నారా లోకేశ్‌ను కలిసి రూ. 10 లక్షల చెక్కు అందజేశారు సాయి తేజ్‌. వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నటుడు ఇటీవల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తాన్ని నేడు చెక్కు రూపం లో అందజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement