Friday, September 6, 2024

AP: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ… పలువురు ప్రయాణికులకు గాయాలు

లావేరు, జులై 19: జిల్లాలోని లావేరు మండలం అదపాక వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ కు చికిత్స కోసం తరలించారు. లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement