Saturday, July 6, 2024

AP: ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి..

నందికొట్కూరు : ఆర్టీసీ బస్సు, మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరు పరిధిలో చోటుచేసుకుంది.

బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన హర్షపోగు రవి (35) అనే వ్యక్తి గ్రామ చివరలో ఉన్న‌ భారత్ పెట్రోల్ బంకు వ‌ద్ద‌కు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు ఢీకొంది. బస్సు కర్నూలు నుండి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మోటార్ సైక్లిస్ట్ రవి అక్కడికక్కడే మృతిచెందారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement