Tuesday, October 1, 2024

Big Breaking | దోపీడీ దొంగల బీభత్సం.. ఆటోలో ప్రయాణికులపై కత్తులతో దాడి

ఏపీలోని కాకినాడ దగ్గరున్న సామర్లకోటలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆటోలో సాధారణ ప్రయాణికుల మాదిరిగానే ఎక్కారు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులపై దాడికి దిగారు. ఈ ఘటన ఇవ్వాల (సోమవారం) రాత్రి కొద్ది సేపటిక్రితం జరిగింది. ఆటో డ్రైవర్​ని కత్తితో పొడిచేశారు. ఆ తర్వాత ఓ మహిళ మెడలో బంగారు చైన్​ని తెంపేశారు. నగలు, నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. ఆ సమంలో ఆటోలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ దొంగల కోసం సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టారు. ఈ క్రమంలో ఒకరిని పట్టుకున్నట్టు సమాచారం. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement