Saturday, September 28, 2024

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

మంత్రాలయం, (ప్రభ న్యూస్): క‌ర్నూలు జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇవ్వాల ఇద్ద‌రు చ‌నిపోయారు. మంత్రాల‌యం మండల ప‌రిధిలో మంగళవారం రచ్చమర్రి గ్రామ సమీపంలో కోసిగి క్రాస్ రోడ్డు దగ్గర మోటారు సైకిల్ ను కారు డీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతులను మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామనికి చెందిన వడ్డే వినోద్(27), పెద్దకడుబూరు గ్రామానికి చెందిన‌ వడ్డే ఈరమ్మ (70) గా గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ. హుస్సేన్ పీరా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement