Wednesday, September 18, 2024

AP : పెళ్లి షాపింగ్ వెళ్లి తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకి

గుత్తి, మే 18 (ప్రభ న్యూస్) : అనంత‌పురం జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి మండలంలోనీ జాతీయ రహదారి 44 లో గల సుంకులమ్మ దేవాలయం సమీపం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందాగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, డ్రైవర్ మహమ్మద్ గౌస్ స్వల్ప గాయాలతో బయటపడ్డ సంఘటన గుత్తి మండలంలో చోటుచేసుకుంది.

- Advertisement -

మృతులు ఐదుగురు, వీరు అనంతపురం నగరంలోని రాణి నగర్ చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు వివరాలు ఆలీ సాహెబ్ (58), సైక్ ఫిరోజ్ (28), మహమ్మద్ ఆయాజ్ (6), మహమ్మద్ ఆమన్ (4)ఈ నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ అయిన రెహనా (48) గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరంతా పెళ్లి వివాహ వేడుకలకు హైదరాబాద్ వెళ్లి నూతన వస్త్రాలను కొనుగోలు చేసి తిరిగి అనంతపురం కు బయలుదేరి వస్తుండగా గుత్తి సమీపం వద్ద ఈసంఘటన చోటుచేసుకుంది, గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement