Sunday, October 6, 2024

AP | అనకాపల్లి బాలిక హత్య కేసు.. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో ఓ బాలికను నిందితుడు జులై 6న హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ బాలిక ఇంట్లోకి ప్రవేశించిన అతను ఆమెను విచక్షణారహితంగా కత్తితో పొడిచినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు.

ఈ హత్య కేసులో నిందితుడి కోసం అనకాపల్లి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక టీమ్‌లుగా ఏర్పడి వేర్వేరు మార్గాల ద్వారా నిందితుడు ఎక్కడున్నాడో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడి ఫొటోలను కూడా పోలీసులు మీడియాకు విడుదల చేశారు. తాజాగా పోలీసులు ఓ ప్రకటన కూడా వెలువరించారు.

నిందితుడు సురేశ్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతిని జిల్లా పోలీసులు ప్రకటించారు. బాలిక హత్య కేసు నిందితుడి వివరాలు కనుక తెలిస్తే 9440796084, 9440796108, 9440904229, 7382625531 లేదా డయల్ 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలని అనకాపల్లి పోలీసులు సూచించారు. నిందితుడి గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని.. వారికి బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement