Sunday, October 20, 2024

Resign – ఆంధ్ర‌ వ‌ర్శిటీ విసికి బెదిరింపు కాల్స్ …

ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌, రిజిస్ట్రార్‌కు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి.. . యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఉన్న వీవీజీ ప్రసాద్ రెడ్డి , రిజిస్ట్రార్‌గా ఉన్న జేమ్స్ స్టీఫెన్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.. వెంటనే తమ పదవికి రాజీనామా చేసి.. తప్పుకోవాలని ఆగంతకులు డిమాండ్ చేశారు. దీంతో విశాఖ ⁠మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏయూ అధికారులు.. ⁠హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కాల్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.. ఇక, బెదిరింపుల నేపథ్యంలో.. యూనివర్సిటీకి పోలీసు సెక్యూరిటీ ఇవ్వాలని మూడో పట్టణ పోలీసులకు కోరారు ఏయూ అధికారులు. కాగా, ఏయూలో గోల్‌మాల్‌ జరిగిందంటూ ఆరోపణలు వచ్చాయి.. యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలను కూడా వీసీ వ్యాపారం చేశారని కొందరు ఆరోపించారు.. లక్షలాది రూపాయలు తీసుకుని పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారంటూ.. స్వయంగా వర్సిటీలో పనిచేసే ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement