Friday, October 18, 2024

Report – ఎపిలో ఆ న‌లుగురు ఐఎఎస్ లు

నేడు సిఎస్ క‌లిసి రిపోర్ట్ చేసిన
ఆమ్రపాలి , రోనాల్డ్‌ రోస్ ,
వాణీ ప్రసాద్ , వాకాటి కరుణ

అమరావతి : డీవోపీటీ ఆదేశాల మేరకు నలుగురు ఐఏఎస్‌ అధికారులు గురువారం ఏపీలో రిపోర్టు చేశారు. తెలంగాణ హైకోర్టు డీవోపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించడంతో తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన ఆమ్రపాలి కాట , రోనాల్డ్‌ రోస్ , వాణీ ప్రసాద్ , వాకాటి కరుణ ఏపీ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ను కలిసి రిపోర్టు చేశారు. మరోవైపు ఏపీ నుంచి రిలీవ్‌ అయిన ఐఏఎస్‌ అధికారులు సృజన, హరికిరణ్‌, శివశంకర్‌లు బుధవారమే హదరాబాద్‌కు వచ్చి సీఎస్‌ శాంతికుమారికి రిపోర్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement