Saturday, September 28, 2024

Renu Desai | పవన్‌ కల్యాణ్‌ విజయం… ప్ర‌జ‌ల‌కు మంచే జ‌రుగుతుంది

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీనిపై ఆయన మాజీ భార్య రేణూదేశాయ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా’ అంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫొటోలను పంచుకున్నారు.

ఈ పోస్ట్‌ను నెటిజన్లతో పాటు పవన్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. మరోవైపు పవన్‌ గెలుపును జన సైనికులు కూడా ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌ నివాసం వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారందరికీ పవన్‌ భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలు ధన్యవాదాలు తెలుపుతూ అభివాదం చేశారు. ఆ వీడియో కూడా ఎక్స్‌లో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement