Friday, September 6, 2024

AP | జల్ జీవన్ ప్రాజెక్టుకు స‌హ‌క‌రించ‌డండి : ఎంపీ కృష్ణదేవరాయలు

పల్నాడులో జలజీవన్ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటంలోని అవాంతరాలను తొలగించి ప్రతి ఇంటికి నీరందించెందుకు సహకరించాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు రూ.350 కోట్లు నిధులు మంజూరయ్యి ఉన్నాయని అన్నారు.

ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటిని నింపి, అక్కడినుంచి ప్రతి ఇంటికి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని, కానీ పల్నాడులో ఈ ట్యాంక్ లను నింపేందుకు నీటి కొరత ఉందని, కొన్ని ప్రాంతాల్లో దాదాపు 1200 అడుగులు బోర్లు వేస్తేనే నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఈ స్థితిలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో నీటి సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలని, పెద్ద మొత్తంలో మంజూరయిన నిధులు వృధా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఆధునాతన టెక్నాలజీ ద్వారా నీరు పడే ప్రాంతాల్ని గుర్తిస్తాం

ఇందుకు కేంద్ర జల వనరుల మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ.. పలు సమావేశాల్లో ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యాయని, పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని, అధునాతన టెక్నాలజీని ఉపయోగించి, నీరు ఎక్కడ లాభ్యమౌతుంది, ఎక్కడ బోర్లు వేస్తె నీరు పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చని, కొన్ని గ్రామాల్లో అవసరాన్ని బట్టి రెండు బోర్లు కూడా వెయ్యాల్సి వస్తోందని బదులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement