Friday, October 18, 2024

Tirumala: శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఒక్క‌రోజే 6.18 కోట్ల ఆమ్దానీ రాక‌!

తిరుమల: మునుపెన్నడూ లేనివిధంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్క రోజు ఇంత పెద్దమొత్తంలో హుండీ ఆదాయం రావడం ఇదే ఫస్ట్​ టైమ్​ అని వెల్లడించారు. ఎన్నడూ లేనివిధంగా చరిత్రలో తొలిసారి ఒక్క రోజులోనే స్వామి వారి హుండీ ఆదాయం 6.18కోట్ల రూపాయలుగా ఉందని, ఇప్పటి వరకు 2012 ఏప్రిల్​ 1వ తేదీన ఇదే స్థాయిలో 5.73 కోట్ల ఆదాయం వచ్చిందని వివరాలు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement