Tuesday, September 17, 2024

Sub Collector Office – కాలిందా.. కాల్చేశారా… మ‌ద‌న‌ప‌ల్లి ప్ర‌మాదంపై చంద్ర‌బాబు ఆగ్ర‌హం

అర్ధ‌రాత్రి మ‌ద‌న‌ప‌ల్లి స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ద‌గ్ధం
కీల‌క ఫైళ్ల‌తో స‌హా స‌ర్వం బూడిద‌
ప్ర‌మాదంపై అనుమానాలు
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆగ్ర‌హం
డిజిపి.సిఐడి చీఫ్ ను అక్క‌డ‌కు వెళ్లాల‌ని ఆదేశం
మినిట్ టు మినిట్ స‌మాచారం ఇవ్వాల‌న్న చంద్ర‌బాబు

అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి హెలికాప్టర్‌లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీ, సీఐడీ చీఫ్‌ మదనపల్లెకు వెళ్లి విచార‌ణ‌చేపట్టారు. అగ్నిప్రమాదంలో కీలక దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం. నూతన సబ్‌కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదమా? కుట్రపూరితమా? అనే అంశంపై విచారణకు సీఎం ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగులబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి.

పోలీసుల అదుపులో ఉద్యోగి

- Advertisement -

ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయం సిబ్బంది విషయం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం పక్కనే ఉండటంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఈ మంటల్లో విలువైన రెవెన్యూ రికార్డులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్‌ అనే ఉద్యోగి కార్యాలయంలో రాత్రి 12 గంటల వరకు ఉన్నట్లు సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు సీఎస్‌ నీరభ్ కుమార్‌ ప్రసాద్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌ చంద్ర లడ్హా హాజరయ్యారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్‌ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్‌ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని చంద్రబాబు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. రాత్రి 11.24 గంటలకు ప్రమాదం జరిగినట్లు ఆయనకు జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై సీఎం ఆరా తీశారు.

ఆ సమయం వరకు ఉద్యోగి ఎందుకున్నాడు?

ఆదివారం అర్ధరాత్రి వరకు కార్యాలయంలో గౌతమ్‌ అనే ఉద్యోగి ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయం వరకు ఉద్యోగి ఉండటానికి కారణాలు తెలుసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఉద్యోగి ఎందుకు వెళ్లాడు.. ఏ పని కోసం వెళ్లాడు? అనే వివరాలను అడిగారు. ఘటన జరిగిన సమయంలో విధుల్లో వీఆర్‌ఏ ఉన్నాడని అధికారులు వివరించారు. ఘటనాస్థలికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఏం విచారణ చేశారని సీఎం ప్రశ్నించారు. ఫోరెన్సిక్‌, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై నిలదీశారు. ఘటన సమయంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అక్కడ సంచరించిన వ్యక్తుల వివరాలు సేకరించాలన్నారు. నేరాలు చేసి సాక్ష్యాల చెరిపేతలో ఆరితేరినోళ్లు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన ఈ తరహా ఘటనలను అధికారులు మరిచిపోకూడదన్నారు. సాక్ష్యాల చెరిపివేత కోణంపై లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఘటనపై సమగ్ర వివరాలు తన ముందుంచాలన్నారు.

మదన పల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సిఎం ఉన్నత స్ధాయి సమీక్ష
• సీఎస్, సిఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష
• అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం
• అసైన్డ్, 22 ఎ, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీ సర్వే ఫైల్స్ దగ్దం అయినట్లు సమాచారం
• జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన సిఎం
• రాత్రి 11.24 ప్రమాదం జరిగినట్లు వివరించిన జిల్లా అధికారులు
• ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడం పై ఆరా తీసిన సిఎం
• ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు కార్యాలయంలో ఉన్న గౌతమ్ అనే ఉద్యోగి
• ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలన్న సిఎం
• అతను ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడు అని వివరాలు అడిగిన సిఎం
• ఘటన సమయంలో విధుల్లో విఆర్ఎ ఉన్నాడని వివరించిన అధికారులు
• ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారు అని అడిగిన సిఎం
• ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యం పై ప్రశ్నించిన ముఖ్యమంత్రి
• ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలన్న సిఎం
• సిసి కెమేరాల ఫూటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్న ముఖ్యమంత్రి
• సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ ప్రాంతంలో ఆ సమయంలో సంచరించిన వ్యక్తుల వివరాలు, వారి కాల్ డాటా సేకరించాలని ఆదేశం
• నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారన్న సిఎం
• గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మరిపోకూడదని…ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సిఎం అదేశం.
• ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలన్న సిఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement