Thursday, September 12, 2024

Kadapa జిల్లాలో నెత్తురోడిన రోడ్లు – ఎనిమిది మంది దుర్మరణం

కడప – ప్రభ న్యూస్ బ్యూరో. – శ్రీ కృష్ణాష్టమి పర్వదిన రోజున ఉమ్మడి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. జిల్లాలోని దువ్వూరు మండలం చింతకుంట వద్ద జరిగిన కారు బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కడప- అన్నమయ్య జిల్లాల సరిహద్దులో గువ్వల చెరువు ఘాటు వద్ద కారు – లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది.

కర్నూలు నుంచి తిరుమల కు వెళ్ళుతున్న కారు దువ్వూరు మండలం చింతకుంట వద్ద బయన పల్లి వద్ద జాతీయ రహదారి మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నాగలక్ష్మి భాయ్ (70) అనే వృద్ధురాలు, భగత్ సింగ్ (35) తో పాటు అతని నెలల పాప మృతి చెందిన వారిలో ఉన్నారు. మరో ఐదు మంది తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

దేవుని దర్శనం కోసం, పాప పుట్టి వెంట్రుకలు కు తిరుమలకు వెళుతున్న సందర్భంలో ప్రమాదానికి గురి కావడంతో బాధిత కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. గాయపడ్డ వారిని 108 సహాయంతో మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

అదేవిధంగా కడప- రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వలచెరువు ఘాటుపైన లారీ కంటైనర్ కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. రాయచోటి నుండి కడప వైపు లారీ కంటైనర్ వస్తుండగా కడప నుండి రాయచోటి వైపుకు ఏపీ 39 బి 7281 నెంబర్ గల కారు ఎదురుగా రావడంతో కంటైనర్ ఢీకొన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో కారు నుజ్జు అయ్యింది. కంటైనర్ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు, కంటైనర్ డ్రైవర్ తో సహా మొత్తం ఐదుగురు అక్కడకక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న గుజ్జుగారి నాగయ్య (46), వల్లెపు చిన్న వెంకటమ్మ (50), వల్లెపు నాగలక్ష్మి దేవి (35), కారు డ్రైవర్ కమ్ ఓనర్ ఖాడమియ్యా గారి షరీఫ్ (38)తో పాటు కంటైనర్ డ్రైవర్ ఘటనా స్థలంలోని మృతి చెందారు.

వల్లెపు చిన్న వెంకటసుబ్బమ్మ భర్త చనిపోయి పెద్దకర్మ కార్యక్రమ అనంతరం బందువుల ఇండ్లలో ధీ చూసేందుకు బాడుగ కారులో వెళ్తుండగా ఈదుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు అంత చక్రాయపేట మండలం కొండగరు పల్లె గ్రామం వడ్డేపల్లి కి చెందిన వారుగా తెలుస్తోంది. కంటైనర్ డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది. గువ్వలచెరువు ఘాట్ ఆరో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ..

జిల్లా సరిహద్దులో అన్నమయ్య జిల్లా రామాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న నలుగురు, కంటైనర్ డ్రైవర్ తో సహా మొత్తం 5 మంది మరణించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును , అందుకు కారణాలను నిశితంగా పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఎస్పీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కడప నుండి గువ్వలచెరువుకు వెళ్తున్న కారును కంటైనర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీస్ అధికారులు ఎస్పీ కి వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement