Thursday, September 12, 2024

AP | ట్రాన్స్‌జెండర్లకు రేష‌న్ క‌ర్డులు…

ఏపీ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. త్వరలోనే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమశాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై సమీక్ష జరిపారు. ఈ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగానే ట్రాన్స్‌జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement