Wednesday, October 2, 2024

AP : పిఠాపురంలో ప‌ర్య‌టించ‌నున్న రామ్‌చ‌ర‌ణ్‌

జ‌న‌సేన ఛీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తుగా గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్ పిఠాపురంలో ఇవాళ ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా త‌న త‌ల్లి సురేఖ‌తో క‌లిసి కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్క‌డ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

- Advertisement -

అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే చరణ్ బాబాయి పవన్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు మద్దతు తెలుపుతూ వీడియోను కూడా విడుదల చేశారు. అలాగే పలువరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పవన్‌కు మద్దతును ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement