Tuesday, October 15, 2024

Puttaparthi – శ్రీ స‌త్య‌ సాయిబాబా స‌న్నిధిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్

శ్రీ సత్యసాయి బ్యూరో జూలై 21 (ప్రభన్యూస్) హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఆదివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన గురుపౌర్ణమి వేడుకల్లో సతీ సమేతంగా హాజరై ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు సాయిబాబా మహాసమాధిని దర్శించుకుని, శ్రద్ధాంజలి ఘటించారు.

అంత‌కు ముందు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల పుట్టపర్తి కి రెండు రోజులు పర్యటన సందర్భంగా శనివారం రాత్రి పుట్టపర్తి ప్రశాంతి నిలయం కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, జిల్లా ఎస్పీరత్న ,సత్య సాయి ట్రస్ట్ రత్నాకర్. అడిషనల్ ఎస్పీ విష్ణు, తదితరులు స్వాగతం పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement