Monday, September 16, 2024

Kurnool: కలెక్టరేట్ ఎదుట జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ నిరసన..

కర్నూలు బ్యూరో : కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యునిపై రోగి బంధువులు దాడి చేయడాన్ని నిర‌సిస్తూ బుధవారం కర్నూల్ కలెక్టరేట్ ఎదుట జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు. సుమారు 600మంది జూనియర్ డాక్టర్లు, పీజీలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌ సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్యుత్ మాట్లాడుతూ… విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై దాడులు జరగడం దారుణమన్నారు. కానీ వీటిని పట్టించుకునే వారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లో ఉన్న జూనియర్ వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement