Friday, September 20, 2024

AP | ఆస్తి తగదాలు…. మాజీ జెడ్పిటిసిపై దాడి…

కర్నూలు జిల్లా, కోసిగి (ప్రభ న్యూస్) ఆస్తి వివాదానికి సంబంధించి కోసిగి మండలం మాజీ జెడ్పీటీసీ దళవాయి మంగమ్మను కురువ మల్లయ్య అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోసిగికి చెందిన కురువ మల్లయ్య మాజీ జెడ్పీటీసీ మంగమ్మ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే కోసిగి సాయిబాబా గుడి సమీపంలోని త‌న‌ సొంత కాంప్లెక్స్ లో బోరు మరమ్మతుల కోసం మంగమ్మ వెళ్లింది.

బోరు రిపేరు చేయిస్తుండగా అప్పటికే తప్పతాగి ఉన్న కురువ మల్లయ్య అక్కడికి చేరుకొని మద్యం మత్తులో కూరగాయలు కోసే కత్తితో వెనుక వైపు నుండి మంగమ్మను పొడిచినట్లు బాధితురాలు మంగమ్మ తెలిపారు.

అలాగే పక్కనే ఉన్న బండ రాయి ని కూడా ఎత్తి తనమీద వేయడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్నవారు అడ్డుకున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా కాంప్లెక్ అమ్మే విషయంలో గొడవ పడుతూ మనస్సులో కక్ష ఉంచుకుని దాడి చేసినట్లు తెలిపింది.

వెంటనే కుటుంబ సభ్యులు కోసిగి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం ఆదోని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మల్లయ్య ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బాధితురాలు మంగమ్మకు ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఆరాతీసి నట్లు తెలిసింది.

వైసీపీ మండల ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డి ఆదోని ఆసుపత్రికి వెళ్లి కత్తి పోటుకు గురైన మంగమ్మ ను పరామర్శించారు. ఏది ఏమైనప్పటికి మాజీ జెడ్పిటిసి మంగమ్మ పై హత్య యత్నం కోసిగి మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement