Wednesday, December 18, 2024

KNL | ఖైదీలు జైలు జీవితాన్ని ఒక గుణపాఠంలా తీసుకోవాలి.. ఎస్పీ బిందు మాధవ్

కర్నూలు బ్యూరో : ఖైదీలు జైలు జీవితాన్ని ఒక గుణపాఠంలా తీసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. జిల్లా కారాగారం భద్రత దృష్ట్యా కర్నూలు, పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా కారాగారంను ఎస్పీ జి.బిందు మాధవ్ మంగళవారం సందర్శించారు. జిల్లా కారాగారం పరిసరాలను, ఖైదీల గదులు, ఖైదీల కోసం వచ్చే సందర్శకుల గదిని, ఖైదీలకు ఇచ్చే ఆహార పదార్థాల నాణ్యాతను జిల్లా ఎస్పీ పరిశీలించారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సంద‌ర్భంగా అంతర్గత భద్రతపై జైలు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఖైదీలు జైలు జీవితాన్ని గుణపాఠంలా తీసుకుని జైలు నుండి విడుదలైన‌ తర్వాత మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయాలన్నారు. భద్రత పరంగా ఎటువంటి సమస్యలున్నా.. తమ దృష్టి తీసుకురావాలని, ఖైదీల్లో పరివర్తన కోసం తీసుకోవలసిన చర్యల గురించి తెలియజేశారు. అనంతరం జైలు పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లదకరంగా ఉన్నాయని జిల్లా ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేసి జైలు విజిటింగ్ బుక్ లో సంతకం చేశారు.

- Advertisement -

ఈ భధ్రత రివ్యూ కమిటీ సమావేశంలో జిల్లా కారాగారం పర్యవేక్షణాధికారి చంద్రశేఖర్, జిల్లా సబ్ జైళ్ళ అధికారి డి.నరసింహా రెడ్డి, డిప్యూటీ జైలర్ లు అనిల్ కుమార్ రెడ్డి, నాగరాజు, మెడికల్ ఆఫీసర్ డా.జగధీష్, డీసీఆర్ బి సీఐ గుణశేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement