Tuesday, September 17, 2024

AP | ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత..

రాష్ట్రంలో కురుస్తున్న‌ భారీ వర్షాల నేపధ్యంలో కృష్ణా నది ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement