Monday, October 21, 2024

AP | తెలంగాణ నుంచి ఏపీ వ‌చ్చిన ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ !

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారి ప్రశాంతికి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది. కేంద్ర ఆదేశాలతో… తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన నలుగురు ఐఏఎస్ అధికారుల్లో ప్రశాంతి ఒకరు. కాగా, ఐఏఎస్ అధికారిణి ప్రశాంతికి ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది.

అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిగా ప్రశాంతిని నియమిస్తూ రాష్ట్ర సీఎస్‌ నిరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి వ‌చ్చిన‌ ఐఏఎస్ అధికారులు అమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష, అభిషేక్ మొహంతి ఏపీలో రిపోర్టు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement