Sunday, September 8, 2024

శ్రీశైలంలో మూర్చ పోయిన భక్తురాలుకి అత్యవసర సాయం

శ్రీశైలంలో క్యూ లైన్లలో ఓ భక్తురాలు మూర్చ పోయింది. ఇది గమనించిన అక్కడి క్యూ లైన్ పోలీసులు గేటుకున్న తాళం ను తొలగించి భక్తురాలుకి అత్యవసర సాయం అందించారు.పోలీసులు అప్రమత్తంగా ఉండి భక్తురాలి ను సకాలంలో కాపడినందుకు శ్రీశైలం పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఆదివారం శ్రీశైలానికి దర్శనానికి వచ్చి రద్దీ వలన ఓ భక్తురాలు మూర్చ పోయింది.

అత్యవసర పరిస్ధితులలో ఎమర్జన్సీ గేట్ లాక్ బ్రేక్ చేసి భక్తురాలిని దేవస్ధానం హాస్పిటల్ కు తీసుకెళ్ళి డాక్టర్ల చే సరైన సమయంలో మెరుగైన వైద్యం అందించి కోలుకునే విధంగా చేసిన శ్రీశైలం టు టౌన్ కానిస్టేబుల్స్ మద్ది లేటి , నాను నాయక్ పోలీసు అధికారులను ఎస్పీ ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement