Friday, October 18, 2024

AP| తస్మాత్ జాగ్రత్త.. ! ఈ పది జిల్లాల్లో బీ అలెర్ట్… చంద్రబాబు


నాలుగు రోజులూ భారీ వర్షాలు
ఇప్పటికే నెల్లూరులో 30 మిల్లీమీటర్ల వర్షం
నెల్లూరు తిరుపతిలో ఎన్డీఆర్ ఎఫ్ దళాలు సిద్ధం
ఫోన్ ల్లో అప్రమత్తం చేయండి
చెరువులు, రిజర్వాయర్లు నింపండి
మంత్రులు, అధికారులు అప్రమత్తం కావాలి
టెలీ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఆదేశం

( ఆంధ్రప్రభ స్మార్ట్, అమరావతి)
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలెర్ట్ అయ్యారు. జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండి, పర్యవేక్షించాలని ఆదేశించారు. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్లు పంపి అలెర్ట్ చేయాలని, చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలని సూచించారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలన్నారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పది జిల్లాలు జాగ్రత్త

- Advertisement -

ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరులో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు సీఎంకు వివరించారు. మంగళవారం నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా పెట్టినట్లు అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఈ సీజన్ లో 676 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతానికిగాను ఇప్పటి వరకు 734 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. 18 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం, 8 జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కవ వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు వివరించారు.

వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలన్నారు. అప్రమత్తతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలన్నారు. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలన్నారు. సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరులో 30ఎంఎం వర్షపాతం నమోదైందని వివరించిన అధికారులు…రేపటి నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement