ప్రజలకు పవన్ కళ్యాణ్ పై నమ్మకం లేదని, సినిమాలలో పవన్ కి మంచి క్రేజ్ ఉండొచ్చు కానీ.. రాజకీయంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ పై నమ్మకం లేదని మంత్రి రోజా అన్నారు. నగరి నియోజకవర్గం పూడి గ్రామంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అవేవీ పట్టించుకోకుండా ప్రజలకు మంచి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు మంత్రి రోజా. ప్రజల్లో జగన్ పై ఆదరణ పెరుగుతుందన్నారు. విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఏం చేస్తాడని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానని అనుకోవడం అవివేకమేనని.. నిజంగా ఆయన ప్రజలకు ఏం చేశారు ? ఎందుకు పార్టీ పెట్టారు ? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనే విషయాలపై ఆయనకు కూడా క్లారిటీ లేదని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.