Tuesday, September 17, 2024

Pension Distribution – ఎపి సీఎం పర్యటనలో మార్పు

అమరావతి – ఆంధ్రప్రదేశ్‌లో ఉదయమే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయ్యింది.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్‌ అందిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు.. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లా పర్యటించనున్నారు. అయితే, సీఎం కర్నూలు జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఆయన పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో పర్యటించాల్సి ఉండగా.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఆ పర్యటన రద్దు అయ్యింది. దానికి బదులుగా ఓర్వకల్‌లో పర్యటిస్తారు .

అక్కడ ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. తర్వాత స్థానికులతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడుతారు. అనంతరం మధ్యాహ్నం 4గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement