Saturday, October 26, 2024

Papagni – ఇసుకాసురుల ట్రాక్టర్ వేగానికి రైతు కుటుంబం బలి

ఆంధ్రప్రభ స్మార్ట్, పులివెందుల (కడప జిల్లా) : ఇసుకాసురల స్వైర విహారానికి ఓ రైతు కుటుంబం తల్లడిల్లింది. ఇసుక రవాణాలోని ఓ ట్రాక్టర్ తనయుడిని మింగేస్తే.. తండ్రి కాలును ఛిద్రం చేసింది. ఈ దయనీయ ఘటన కడప జిల్లా పులివెందులలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మొయిళ్ళ చెరువుకు చెందిన రైతులు తండ్రి కొడుకు పని నిమిత్తం వేంపల్లి మీదుగా గండి వైపు బుల్లెట్ పై వెళ్తున్నారు. అదే సమయంలో పాపాగ్ని నదిలో ఇసుకను తోడేస్తున్న ఇసుకాసరుల ట్రాక్టర్ అతివేగంగా ఆ తండ్రి కొడుకుల బుల్లెట్ ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కొడుకు అక్కడిక్కడే ప్రాణాలు వదిలేశాడు. తండ్రి కాలు తెగి పడింది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement