Tuesday, September 17, 2024

చంద్ర‌బాబు అరెస్ట్ ను నిర‌సిస్తూ పాద‌యాత్ర‌…

ప‌ల‌మ‌నేరు – చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా , వెంటనే ఆయన్ను విడుదల చేయాలని కోరుతూ పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. గంగవరం మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ (ఎన్టీఆర్ సర్కిల్) నుంచి కీలపట్లలోని కోనేటి రాయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ వద్ద వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం కోనేటి రాయ స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానంతరం మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, వెంటనే విడుదల కావాలని ఆకాంక్షిస్తూ టెంకాయలను కొట్టి స్వామివారిని వేడుకున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి . తదనంతరం ఆలయం ఎదుట గంగవరం మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్, పలమనేరు పట్టణ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజులు వైకాపా ప్రభుత్వ కక్షపూరిత చర్యలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలోపలమనేరు పట్టణ, గంగవరం మరియు పలమనేరు రూరల్ మండలం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement