AP | జనసేనలో చేరిన పడాల భూదేవి..

టీడీపీ బిగ్ షాక్ తగలింది. రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, భారత ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారం అందుకున్న పాలకొండ నియోజవర్గానికి చెందిన పడాల భూదేవి దంపతులు జనసేనలో చేరారు. ఈ మేరకు ఇవాళ అనకాపల్లిలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకొండలో జనసేన జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాగా, ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దూసుకెళ్తున్నారు. అధికార వైసీపీ, ముఖ్యమంత్రి జగన్‌పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ ఆదివారం అనకాపల్లి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు.

Exit mobile version