Wednesday, September 18, 2024

NHRC | గుడ్లవల్లేరు ఘటనపై సీఎస్, డీజీపీకి నోటీసులు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లలో రహస్య కెమెరాల ఘటనను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటోగా తీసుకుంది. మహిళల భద్రత, గౌరవ హక్కుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ సీఎస్, డీజీపీకి కమిషన్ నోటీసులు జారీ చేసింది.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ స్టేటస్‌తో సహా ఈ అంశంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అధికారులు తీసుకున్న, ప్రతిపాదించిన చర్యలను కూడా నివేదికలో పేర్కొనాలని సూచించింది. రెండు వారాల్లోగా అధికారుల నుంచి స్పందన రావాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement