Sunday, September 22, 2024

AP: ఒంట‌రి మ‌హిళ‌కు నో సేఫ్.. ట్రావెల్ బ‌స్సులో వివాహిత‌పై లైంగిక‌ దాడి

ఇటీవ‌ల కాలంలో ఇది రెండోది
కూక‌ట్‌ప‌ల్లి నుంచి విజ‌య‌వాడ‌కు బ‌స్సులో ఘ‌ట‌న‌
ఆల‌స్యంగా వెలుగు చూసిన వైనం
చౌటుప్ప‌ల్ పోలీసుల‌కు బాధితురాలు ఫిర్యాదు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ఒంట‌రి మ‌హిళ‌కు ట్రావెల్ బ‌స్సులు సేఫ్ కాదు. ఇటీవ‌ల కాలంలో ఓ ప్రైవేటు బ‌స్సులో లైంగిక దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో ఈనెల 18న జ‌రిగింది. యాదాద్రి కొత్త‌గూడెం జిల్లా చౌటుప్ప‌ల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వివాహిత‌పై లైంగిక దాడి జ‌రిగింది. ఈ మేర‌కు చౌటుప్ప‌ల్ పోలీసుల‌కు బాధితులు ఫిర్యాదు చేశారు.. ఈనెల 18న కూక‌ట్‌ప‌ల్లి-విజ‌య‌వాడ ట్రావెల్ బ‌స్సులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే ఈఘటపై ఈనెల 21న చౌటుప్పల్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఘాతుకానికి పాల్ప‌డింది క్లీన‌రే!
కూకట్ పల్లిలో ఓ మహిళా ప్రయాణికురాలు ప్ర‌ముఖ సంస్థ‌కు చెందిన‌ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. విజయవాడకు వెళ్లాలని చెప్పడంతో టికెట్‌ ఇచ్చిన కండెక్టర్‌ ఆమెకు కూర్చునేందుకు సీటు చూపించాడు. అక్కడ కూర్చున ఆమె నిద్రలోకి జారిపోయింది. బస్సు క్లీనర్‌ తనపై లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు మహిళ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌కు కేసు బ‌దిలీ…
ఈ కేసును కూక‌ట్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్‌కు చౌటుప్ప‌ల్ పోలీసులు బ‌దిలీ చేశారు. అయితే కూక‌ట్‌ప‌ల్లి పోలీసులు ఈ సంఘ‌ట‌న‌పై ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement