Friday, September 13, 2024

AP | కనకదుర్గమ్మ సేవలో నీతి అయోగ్ చైర్మన్..

(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో): ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ సేవలో నీతి ఆయోగ్ చైర్మన్ పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం (మంగళవారం) అమ్మవారి ఆలయాన్ని సందర్శించగా ఆలయ డిప్యూటీ ఈవో లీలాకుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరు అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేయ‌గా, ఆలయ డిప్యూటీ ఈఓ అధికారులు అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement