Saturday, September 21, 2024

New Joining – జ‌న‌సేన‌లో చేరిన 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృధ్వీ, జానీ మాస్ట‌ర్

మంగ‌ళ‌గిరి – 30 ఇయ‌ర్స్ ఇండస్ట్రీ, న‌టుడు పృధ్వీ రాజ్, ప్ర‌ముఖ కొరియో గ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ లు జ‌న‌సేన పార్టీలో చేరారు.. మంగ‌ళ‌గిరి జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఈ ఇద్ద‌రికి పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్…
గ‌తంలో వైసిపిలో ఉన్న పృధ్వీ ఆ త‌ర్వాత ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు..తాజాగా ఆయ‌న జ‌న‌సేన తీర్ధం తీసుకున్నారు.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి కొద్ది రోజుల నుంచి ఏపీలో జానీ మాస్టర్ యాక్టివ్గా పర్యటనలు చేశారు. కొన్నాళ్ల క్రితం నెల్లూరులో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న ఒక పోరాటానికి సైతం ఆయన మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అంతే కాదు డిసెంబర్ 29వ తేదీన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్యని కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేతలతో కలిసి హరినామ జోగయ్యను పాలకొల్లు నివాసంలో కలిసి మాట్లాడడంతో జానీ మాస్టర్ ఏపీ నుంచి జనసేన అభ్యర్థిగా ఏదో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

ఇక దానికి ఊతం ఇచ్చే విధంగా జానీ మాస్టర్ కూడా జనసేన లోని కీలక నేతలతో ఆ మధ్య పెద్ద ఎత్తున భేటీ అయ్యారు. ఇక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా జానీ మాస్టర్ చెప్పుకుంటూ ఉంటారు. ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ప్రసారమయ్యే డీ షో ద్వారా పాపులర్ అయిన ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఆయన హీరోగా కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఒకపక్క హీరోగా మరొక పక్క కొరియోగ్రాఫర్ గా సినిమాలు చేస్తున్నా సరే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన జనసేనలో జాయిన్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే టీడీపీ-జనసేన పొత్తులో ఉన్న క్రమంలో జానీ మాస్టర్ కి ఎక్కడి సీటు దక్కుతుందో చూడాలి మరి. ఇక పృధ్వీ కూడా అసెంబ్లీకి పోటీ చేసే అలోచ‌న‌లో ఉన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement