Saturday, September 21, 2024

కొత్త‌ కారు.. కొన్న గంట‌కే యాక్సిడెంట్..

కొత్త కారు అదుపుత‌ప్పి బైక్‌ల‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న తిరుప‌తిలో ఈ రోజు జ‌రిగింది. కొత్తగా కారు కొనుగోలు చేసిన‌ ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా కారు టైరు పేలి అదుపు తప్పింది. తిరుపతి అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహ ఈ రోజు మధ్యాహ్నం కొత్త కారును కొనుగోలు చేశారు.

ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ సమీపంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తుండగా స్థానిక‌ ఎస్కే ఫాస్ట్ ఫుడ్స్‌ వద్ద కారు టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పాదచారులపైకి, వాహనాలపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. 12 ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే కారు యజమాని తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement