Sunday, September 22, 2024

Nellore – కంటైనర్ తో కారు ఢీ – స్పాట్ లోనే ముగ్గురు మరణం

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం‌ జరిగింది. చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి అతి వేగంగా వచ్చన కారు ఢీ కొంది. ఈ ప్రమాదంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు నెల్లూరు నగరం వనంతోపుకి చెందిన జగదీశ్ (50), బాబు (45), వెన్నెల (8) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

.

Advertisement

తాజా వార్తలు

Advertisement