Friday, October 18, 2024

NDA – మోదీ విజన్ వల్లే అద్బుత విజయం : చంద్రబాబు

ఢిల్లీలో జ‌రిగిన ఎన్డీఎ స‌మావేశంలో టిడిపి అధినేత చంద్ర‌బాబు మాట్లాడుతూ, మూడునెలలు రేయింబవళ్లు మోదీ కష్టపడ్డారని అన్నారు. అందుకు తగ్గ ఫలితం దక్కిందన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారన్నారు. భారతీయులు గ్లోబల్ లీడర్లు కాబోతున్నారని వివరించారు.

‘‘ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారు. ఎన్డీయే అద్భుత మెజారిటీ సాధించింది. తన నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎంతోమంది నేతలను చూశాను.. కానీ మోదీ లాంటి పవర్‌పుల్‌ నేతలను ఎక్కడా చూడలేదు. ఏపీలో మోదీ కీలక ప్రచార సభలకు హాజరయ్యారు. మేకిన్‌ ఇండియా విజన్‌తో దేశాన్ని ముందుండి నడిపించారు. మోదీ విజన్‌ వల్లే దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ భారత్‌ పేరు ప్రఖ్యాతులను మోదీ ఇనుమడింపజేశారు’’ అని ప్రశంసించారు.

- Advertisement -

మోదీ విజ‌న్ దేశానికి ఎంతో అవ‌స‌రం..

మోదీ విజన్‌, సమర్థత దేశానికి ఎంతో అవసరని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశానికి మోదీ ఎన్నో అద్భుత విజయాలు అందించారని, దేశంలో యువశక్తి ఐటీ రంగంలో దూసుకుపోతోందని ప్రస్తావించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు మోదీ నాయకత్వం వహిస్తున్నారని, ఏం సాధించాలన్నా ఒక విజన్‌ ఉండాలని, మోదీ విజన్‌ ఉన్న నాయకుడని చంద్రబాబు మెచ్చుకున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నూతన ఎంపీలు అందరినీ ఆయన అభినందించారు.

మోదీపై ప్రశంసల జల్లు

నరేంద్ర మోదీ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరికారని, ఆయన నరేంద్ర మోదీ అని చంద్రబాబు పొగిడారు. మోదీకి విజన్, ఉత్సాహం ఉన్నాయని, పరిపూర్ణ కార్యదక్షత కలిగిన నాయకుడని అన్నారు. తన విధానాలన్నింటినీ నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం భారత్‌కు చాలా మంచి అవకాశమని, ఇప్పుడు మిస్ అయితే ఎప్పటికీ నష్టపోతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఆలోచనను వివరించారు. టీడీపీ లక్ష్యం ఇజం కాదు.. హుమనిజం అని, ఎన్డీఆర్ తమ పార్టీని తీర్చిదిద్దారని, అందుకు అనుగుణంగానే తాము ఎన్డీయేకు మద్దతు ఇచ్చామని చంద్రబాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement